ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ సంవత్సరం జూన్ లో ఆ టీమ్ భారత్ తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 వరకు ఒక టెస్టు చండీగఢ్ వేదికగా జరగనుంది. జూన్ 14న ధర్మశాలలో, 17న లక్నోలో, 20న చెన్నైలో వరుసగా మూడు వన్డేలు జరగనున్నాయి. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ అంటే ఏకపక్షంగా ఉన్నా అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న జట్టుగా ఆఫ్ఘనిస్తాన్, పటిష్టమైన భారత జట్టుకు అప్పుడప్పుడు గట్టి పోటీని ఇస్తోంది. గణాంకాల పరంగా చూస్తే, అన్ని ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) టీమ్ ఇండియాదే పైచేయిగా ఉంది. అయినప్పటికీ ప్రతి మ్యాచ్లోనూ ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తున్న పోరాట పటిమ క్రీడాభిమానులను అలరిస్తోంది.