2026 ఎస్ఐహెచ్ హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సలీమా టెటె కెప్టెన్సీలో భారత్ బరిలో దిగనుంది. అందుకు 20 మంది సభ్యులతో కూడిన భారత టీమ్ ను ఇటీవల ప్రకటించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి హాకీ స్టేడియం వేదికగా మార్చి 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆగస్టులో జరగబోయే హాకీ వరల్డ్ కప్ లో మూడు స్థానాల కోసం మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి.
భారత జట్టు:
సలీమా టెటె (కెప్టెన్), సుశీలా చాను, బన్సారి,దీపికా సోరెంగ్, బిచు దేవి, నిక్కీ ప్రధాన్, మనీషా, ఉదిత, ఇషికా, నేహా, సునేలితా టోపో, సాక్షి, వైష్ణవి, రుతుజా దాదాసో, నవనీత్ కౌర్, ఇషికా, లాల్రెమ్సియామీ, బ్యూటీ డుంగ్ డంగ్, బల్జీత్ కౌర్, అన్ను.