తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ పేరు ఇప్పుడు మరోసారి సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అయితే ఈసారి కారణం విజయ్ సినిమా కాదు… ఆయన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి సినిమా ‘సిగ్మా’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. యాక్షన్, థ్రిల్లర్, మైండ్ గేమ్స్ అంశాల కలయికగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ తీసుకురాగా, ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటనతో సినీ అభిమానుల దృష్టి పూర్తిగా ఈ సినిమాపైనే పడింది. జాసన్ సంజయ్ తొలి సినిమానే ఇంత పెద్ద స్థాయిలో తెరకెక్కుతుండటం విశేషంగా మారింది. సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ జాసన్ మాత్రం దర్శకత్వాన్ని ఎంచుకోవడం ఇప్పుడు పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. అంతేకాదు.. తండ్రి విజయ్ ఇమేజ్కు తగ్గట్టుగా కమర్షియల్ మాస్ సినిమా కాకుండా.. కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నించడం కూడా ఆసక్తిని పెంచుతోంది.సందీప్ కిషన్ కెరీర్లో కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్.. ఇప్పుడు ‘సిగ్మా’లో మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడట. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఈ సినిమాలో చాలా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ. సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సినీ పరిశ్రమలో ఇప్పుడు కొత్త తరహా కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కొత్త కాన్సెప్ట్లను ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో ‘సిగ్మా’లాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే టాక్ వినిపిస్తోంది.