టెహ్రాన్లోని ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధానిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) విధ్వంసం సృష్టించాయి. ఈ భారీ ఎయిర్ స్ట్రైక్స్ లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు.ఇరాన్ పాలక యంత్రాంగం యొక్క నాయకత్వ సముదాయం కేంద్ర ప్రధాన కార్యాలయం ధ్వంసం చేయబడిందని ఐడీఎఫ్ తెలిపింది. ఈ కమాండ్ ప్రధాన కార్యాలయం ఇరాన్లోని అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన దానిలో ఒకటి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో, ఇరాన్ పాలక వర్గానికి చెందిన అత్యున్నత స్థాయి ఫోరమ్ ఉన్న ఈ సముదాయంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ (IAF) రాత్రిపూట దాడి చేసింది. ఈ ఉగ్రవాద పాలన వెనుక ఉన్న నాయకులు మరియు వారు కార్యకలాపాలు సాగించే ప్రధాన కార్యాలయం అంతమొందించబడ్డాయని పేర్కొంది. ఇక మరోవైపు దక్షిణ లెబనాన్లో IDF సైనికులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మెరుగైన ముందస్తు రక్షణ వ్యూహంలో భాగంగా సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని పలు పాయింట్ల వద్ద వారు మోహరించారని తెలిపింది. మేము హిజ్బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని IDF పేర్కొంది. ఇరాన్ పాలక యంత్రాంగం తరపున ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి హిజ్బుల్లా సిద్ధపడింది, కాబట్టి ఆ చర్యల యొక్క పరిణామాలను అది అనుభవించక తప్పదని స్పష్టం చేసింది.