రంజాన్ కేవలం పండుగ కాదు…ఆత్మ శుద్ధి చేసుకునే సమయమని మనుషుల మధ్య సోదరభావం, మతాల మధ్య సామరస్యం తెలంగాణ సంస్కృతి. ఆ సంస్కృతిని అందరం కలిసి కాపాడుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అన్ని మతాలు ఐక్యంగా ఉండటమే తెలంగాణకు శ్రీరామరక్ష. అందరి తోడ్పాటుతో దేశం లో తెలంగాణ ను అభివృద్ధి లో ముందు వరుసన నిలబెడతామని స్పష్టం చేశారు. ముస్లింల సంక్షేమం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాం. సీనియర్ నేత షబీర్ అలీ కి సలహాదారు పదవి ఇచ్చాం. ఎనిమిది కార్పొరేషన్లకు మైనారిటీ నేతలను ఛైర్మన్లు చేశామని పేర్కొన్నారు. క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చాం. బాక్సర్ నిక్కత్ జరీన్ కు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మీది , నేను అందరివాడిని… మీ సోదరుడిని. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు.