దేశానికి ముప్పుగా నిలిచే ఉగ్రవాద శక్తులను వారి దేశానికే వెళ్లి ఎదుర్కొనే కథతో తెరకెక్కిన మూవీ ధురంధర్. మొదటి భాగంతో దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో పార్ట్ ‘ధురంధర్-2’..ది రివెంజ్’ తో మొదటి భాగాన్ని మించి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోంది. దాదాపుగా నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆద్యంతం ఆసక్తికరంగా చూసేలా చేసే కథా కథనాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తెరకెక్కించిన తీరు, నటీనటుల ఎంపిక ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా 11 రోజుల్లో మొత్తంగా రూ.1365 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారత్ లో రూ.1023 కోట్లు, ఓవర్సీస్ లో రూ.342 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారంలో రూ.637 కోట్లు, 8వ రోజు రూ.53కోట్లు, 9వ రోజు రూ.42 కోట్లు, 10వ రోజు రూ. 64 కోట్లు, 11వ రోజు రూ.71 కోట్లు రాబట్టింది. ఈ రేంజ్ కలెక్షన్లతో అప్రతిహతంగా దూసుకుపోతున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.