నేడు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలందరికీ ప్రధాని నరేంద్రమోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.’ఇండియా ఫస్ట్’ అనే సూత్రంతో మన పార్టీ ఎల్లప్పుడూ సమాజ సేవలో ముందుంటుంది. మన కార్యకర్తలు వారి నిస్వార్థ సేవకు, అచంచలమైన అంకితభావానికి, సుపరిపాలన పట్ల ప్రగాఢమైన అభిరుచికి ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. వారు క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా పనిచేస్తూ,పెద్ద సంఖ్యలో ప్రజలు మన సిద్ధాంతానికి, పనికి అనుసంధానమయ్యేలా చూశారన్నారు. దశాబ్దాలుగా తమ అంకితభావం, త్యాగం, పట్టుదలతో పార్టీ ఎదుగుదలకు దోహదపడిన అసంఖ్యాక కార్యకర్తలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని తన దార్శనికతకు కేంద్రంగా ఉంచే పార్టీగా బీజేపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో పార్టీ చేసే పనిలో ఇది ప్రతిఫలిస్తుందన్నారు. వికసిత భారత్ను నిర్మించడానికి బీజేపీ కట్టుబడి ఉంది. మనందరి సమిష్టి సంకల్పం ఈ దార్శనికతను ముందుకు నడిపించి, భారతదేశాన్ని ప్రగతి, శ్రేయస్సుల కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.