ఇరాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లతో జరిపిన సంభాషణల ఆధారంగా, ఈ రాత్రి ఇరాన్పై ప్రయోగించాలనుకున్న విధ్వంసక దాడిని నిలిపివేయాలని వారు కోరిన విన్నపాన్ని మన్నిస్తూ.. అలాగే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ‘హోర్ముజ్ జలసంధిని’ (Strait of Hormuz) తక్షణమే, సురక్షితంగా మరియు పూర్తిగా తెరవడానికి అంగీకరించే షరతుకు లోబడి, నేను ఇరాన్పై బాంబు దాడులను మరియు దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి అంగీకరిస్తున్నానని అందులో పేర్కొన్నారు. ఇది రెండు వైపుల నుండి పాటించాల్సిన కాల్పుల విరమణ ఒప్పందమని స్పష్టం చేశారు. మేము ఇప్పటికే మా సైనిక లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసి, అంతకు మించి విజయాలను సాధించినందున, మరియు ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి కోసం అలాగే మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం ఒక ఖచ్చితమైన ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ట్రంప్ వివరించారు. మాకు ఇరాన్ నుండి 10 పాయింట్ల ప్రతిపాదన అందింది, ఇది చర్చలకు సరైన ప్రాతిపదిక అని మేము నమ్ముతున్నాము. గతంలో వివాదస్పదంగా ఉన్న దాదాపు అన్ని అంశాలపై అమెరికా మరియు ఇరాన్ మధ్య అంగీకారం కుదిరింది, అయితే ఈ రెండు వారాల సమయం ఒప్పందాన్ని తుది రూపానికి తెచ్చి పూర్తి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.