భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో అద్భుత కాంబినేషన్లు వచ్చినప్పటికీ, కొన్నింటికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి అరుదైన కలయికల్లో ఒకటి తమిళ సీనియర్ అగ్రనటులు రజనీ కాంత్-కమల్ హాసన్ కలిసి నటించడం. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారన్న వార్త బయటకు రావడంతో, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మొత్తం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే అది కేవలం సినిమా కాదు, ఒక చారిత్రక ఘట్టం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ను స్వయంగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించబోతున్నారు. దీనివల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కథ, నటీనటులు, నిర్మాణ విలువలు ఇలా ప్రతి విషయంలోనూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ సినిమా టెక్నికల్ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.శంకర్ ఈ సినిమాలో విలన్గా నటించనున్నారట. ఇది నిజమైతే, ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభూతిగా మారుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఊహాగానాలు నిజమైతే అంచనాలు మరింత భారీ స్థాయికి చేరతాయి. శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారతీయుడు, శివాజీ, జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు, రోబో వంటి చిత్రాలతో భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపించారు. కమల్ హాసన్, రజనీకాంత్లతో ఆయనకు ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమే. అందుకే ఈ ఇద్దరు మహానటులతో కలిసి ఆయన స్క్రీన్పై కనిపిస్తే అది అభిమానులకు ఒక పండుగలా ఉంటుంది.