ఆంధ్రప్రదేశ్ లో భారత్ కు చెందిన మొట్టమొదటి ప్రైవేట్ 200 టన్నుల థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఆస్ట్రోబేస్ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో, వారు అభివృద్ధి చేసిన 80 టన్నుల ఫుల్-ఫ్లో స్టేజ్డ్ కంబషన్ (FFSC) LOX-LNG ఇంజిన్ను పరీక్షించడానికి ఈ టెస్ట్ స్టాండ్ను ఉపయోగించనున్నారు. ఇది సిద్ధమైన తర్వాత, మన దేశంలోనే అత్యంత అధునాతన రాకెట్ ఇంజిన్ గా నిలవనుంది. కాగా, దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ‘స్పేస్ సిటీ’ని నిర్మిస్తామని మేము చెప్పినప్పుడు చాలా మంది సందేహించారు. కానీ నేడు, ఆ దార్శనికత నిజరూపం దాల్చుతోంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ 200 టన్నుల థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఆస్ట్రోబేస్ ఇక్కడే మన ఏపీలో ఏర్పాటు చేస్తోంది. ఆశయం నుండి ఆచరణ వరకు.. అత్యాధునిక ఆవిష్కరణల భవిష్యత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది.భవిష్యత్తు చాలా ఉత్సాహభరితంగా ఉండబోతోందని పేర్కొన్నారు.