టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించిన ఈ హర్యానా బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లో కూడా భారీ అవకాశాన్ని చేజిక్కించుకుంది అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్న ‘భాగమ్ భాగ్’ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సీక్వెల్లో హీరోయిన్గా మీనాక్షి చౌదరి పేరును పరిశీలిస్తున్నట్టు ముంబై ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మీనాక్షికి బాలీవుడ్లో ఇది పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే… మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అందం తో పాటు, సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ , అలాగే పాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో చూపిస్తున్న జాగ్రత్త ఆమె కెరీర్ను మరింత బలంగా నిలబెడుతోంది. మోడలింగ్ నేపథ్యంతో సినీ రంగంలోకి వచ్చిన మీనాక్షి ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఆమె కెరీర్లో నిజమైన టర్నింగ్ పాయింట్గా నిలిచింది మాత్రం HIT: The Second Case. Adivi Sesh హీరోగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మీనాక్షి పేరు ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా మంచి అవకాశాలు రావడం మొదలైంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆమె క్రేజ్ను మరింత పెంచాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, అలాగే సంక్రాంతి సీజన్లో విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె Naga Chaitanya సరసన Vrushakarma సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమా టాలీవుడ్లో మంచి అంచనాలు సృష్టిస్తోంది. ఇదే సమయంలో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్న మీనాక్షి, ముఖ్యమైన పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని సమాచారం. మొత్తానికి వరుస విజయాలతో టాలీవుడ్లో తన స్థానాన్ని బలపరుచుకున్న మీనాక్షి చౌదరి, ఇప్పుడు నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయికి అడుగులు వేస్తోంది. బాలీవుడ్లో కూడా అవకాశం దక్కితే ఆమె కెరీర్ మరో మెట్టెక్కే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.