ట్రంప్ తో మోదీ ఏం మాట్లాడారు..?

Spread the love
Trump and Modi Conversation on Israel war what they talk about
Trump and Modi Conversation on Israel war what they talk about

Trump and Modi Conversation: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తామే తగ్గించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై భారత్‌లో తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ట్రంప్ మాటలపై స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. భారత్-పాక్ ఒప్పందంలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ట్రంప్‌కు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ విమర్శలకు చెక్ పెట్టినట్టు అయ్యింది..? ఇంతకీ ట్రంప్, మోదీ ఏం మాట్లాడుకున్నారు..? ట్రంప్ డాంబికాలకు ఎలా తెర దించారు.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తీవ్రమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను చంపిన దాడి జరిగింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం జరిగింది. ఈ సంఘటనల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని పదేపదే చెప్పుకున్నారు. ఈ ప్రకటన భారత్‌లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ట్రంప్ మాటలపై స్పష్టత కోరింది. ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. భారత్-పాక్ ఒప్పందంలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ట్రంప్‌కు స్పష్టం చేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ-ట్రంప్ ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. కానీ, ట్రంప్ మధ్యలోనే వాషింగ్టన్‌కు వెళ్లిపోవడంతో ఆ భేటీ రద్దైంది. ఆ తర్వాత ఇద్దరూ 35 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ దాడి తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా అండగా ఉంటుందని చెప్పారు. ఈ సంభాషణలో మోదీ, ఆపరేషన్ సిందూర్ వివరాలను ట్రంప్‌కు వివరించారు. అయితే, భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిత్వం చేసిందన్న ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఖండించారు. ఈ ఒప్పందం భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ఫలితమని, పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశామని మిస్రీ తెలిపారు.

మోదీ స్పష్టతతో ట్రంప్ ప్రకటనపై చర్చకు తెరపడింది. భారత్-పాక్ ఒప్పందంలో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించబోదని మోదీ ట్రంప్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్‌లో అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉందని మిస్రీ వెల్లడించారు. G7 సదస్సులో మోదీ, ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరికి తావు లేదని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి కానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి కానీ చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం భారత్-పాక్ సైనిక స్థాయిలోనే జరిగిందని, ఇందులో అమెరికా పాత్ర లేదని మోదీ తేల్చేశారు. Trump and Modi Conversation

మోదీ క్లారిటీ ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పష్టత కోరింది కాంగ్రెస్. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఏం లాభం వచ్చిందని ప్రశ్నించింది. కేంద్రం సమాధానం చెప్పలేదని, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, మోదీ విదేశీ పర్యటనలు ముగించుకొని రాగానే అఖిలపక్ష సమావేశం పెట్టి, ఆపరేషన్ సిందూర్, ట్రంప్‌తో ఫోన్ చర్చల వివరాలను ప్రతిపక్షాలకు చెప్పాలని కోరారు. కానీ, మోదీ స్పష్టతతో కాంగ్రెస్ ఆరోపణలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని అంటున్నారు. మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదన్న మోదీ మాటలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అంటున్నారు బీజేపీ నాయకులు.

అటు G7 సదస్సు నుంచి తిరిగి వస్తూ, అమెరికా రమ్మని ట్రంప్ మోదీని ఆహ్వానించారు. కానీ, ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేనని మోదీ చెప్పారు. త్వరలో ద్వైపాక్షిక భేటీ జరగాలని ఇద్దరూ నిర్ణయించారు. భారత్‌లో జరిగే తదుపరి క్వాడ్ సమావేశానికి ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన ట్రంప్, భారత్‌లో పర్యటించేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. ఈ సంభాషణలు భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయని చూపిస్తున్నాయి. అయితే, భారత్-పాక్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం లేదన్న మోదీ స్పష్టత భారత విదేశాంగ విధానంలో స్వతంత్రతను స్పష్టం చేసింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదనలు మాత్రం తీవ్రతరం అయ్యాయి.

కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని, మోదీ నాయకత్వంలో భారత్ బలమైన అభివృద్ధి చెందిన దేశంగా మారిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత్ బలహీనమైన మూడో ప్రపంచ దేశంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలో గౌరవం పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని తప్పుబడితే, వాళ్లు పాక్ జట్టులో ఉన్నట్టేనని ఆరోపించారు. కాంగ్రెస్ అసత్య ఆరోపణలు ఆపాలని హితవు పలికారు. కానీ, కాంగ్రెస్ మాత్రం అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ఒప్పందం వివరాలను ప్రజలకు చెప్పాలని కోరుతోంది. ఈ రాజకీయ వాగ్వాదం భారత్-పాక్ సంబంధాల చర్చను మరింత హీటెక్కించింది.

మోదీ స్పష్టతతో ట్రంప్ ప్రకటనపై చర్చకు తెరపడినా, దేశీయ రాజకీయాల్లో వాదనలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ ఉగ్రవాదంపై కఠిన వైఖరి కొనసాగిస్తోంది. భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయి, భారత్-పాక్ సమస్యల్లో అమెరికా మధ్యవర్తిత్వం లేదని మోదీ స్పష్టం చేశారు కూడా. అయితే కాంగ్రెస్ డిమాండ్‌లు, బీజేపీ జవాబులతో ఈ చర్చ మరింత ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి..

Also Read: https://mega9tv.com/international/iran-israel-battle-begins-no-mercy-khamenei-gives-warning-to-trump-and-benjamin/