వీకెండ్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జోరు కనబరిచాయి. నిన్న భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు నేడు లాభాల బాట పట్టాయి. భారీ ఒడిదుడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల తర్వాత, ఈరోజు మార్కెట్లు కోలుకోవడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. నిన్న మార్కెట్ 1,200 పాయింట్లకు పైగా (సెన్సెక్స్) పతనమైన తర్వాత, ఈరోజు కనిష్ట స్థాయిల నుండి గట్టి రికవరీ కనిపించింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరియు ముడిచమురు ధరలు పెరగడం వల్ల మార్కెట్ ప్రారంభంలో కొంత ఆందోళన కనిపించినా, మధ్యాహ్నం తర్వాత దేశీయ కొనుగోళ్లు పెరిగాయి. ఢిల్లీలో జరుగుతున్న India AI Impact Summit 2026 వార్తలు కొన్ని టెక్ మరియు మౌలిక సదుపాయాల కంపెనీలపై సానుకూల ప్రభావం చూపాయి.అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలపడి 90.67 వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ దాదాపు 316 పాయింట్లు పెరిగి 82,814 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సుమారు 117 పాయింట్లు లాభపడి 25,571 స్థాయిని చేరుకుంది.