చంద్రబాబు గారి పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం:వై.ఎస్.షర్మిల

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన పాపులేషన్ పాలసీ పై ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారి పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా ? అని ప్రశ్నించారు. మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా ? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు. మీరు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు.  ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారని దుయ్యబట్టారు.  కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారన్నారు. మాఫియాలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని దోచుకుంటూ బిడ్డలను కనమని చెప్తే ఎలా అని షర్మిల ప్రశ్నించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *