పేపర్ లీక్ లు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావం చేశాయని తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన ‘నీట్’ పేపర్ అంశంపై రేవంత్ స్పందించారు. వైఫల్యాలు మరియు వ్యవస్థీకృత అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్, పార్టీల మధ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో రేవంత్ ఒక పోస్ట్ చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్ష రద్దు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో తీవ్ర ఆవేదనను, అనిశ్చితిని కలిగించిందన్నారు. ఈనెల 3, 2026న భారతదేశంలోని 551 నగరాల్లో మరియు విదేశాల్లోని 14 నగరాల్లో సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇప్పుడు పేపర్ లీక్లు మరియు పరీక్షా ప్రక్రియలో జరిగిన తీవ్రమైన అక్రమాల వల్ల వారంతా మళ్ళీ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవకాశం ఎంతైనా ఉందన్నారు. పేపర్ లీక్లు లేదా అవినీతికి పాల్పడిన వ్యక్తులు లేదా నెట్వర్క్లు ఎంతటి ప్రభావవంతమైన వారైనా, ఏ పదవిలో ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఈ సంక్షోభం వలన ప్రభావితమైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పారదర్శకమైన, సమయపాలనతో కూడిన మరియు సరైన విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కోరారు. అదే సమయంలో, వ్యవస్థాగత వైఫల్యాల వల్ల అమాయక విద్యార్థులు పదేపదే ఇబ్బందులు పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు ఎన్నో త్యాగాలు, మానసిక ఒత్తిడి మరియు ఆర్థిక భారాలను భరించి నీట్ (NEET) పరీక్షకు సిద్ధమవుతారని పోటీ పరీక్షలు అనేవి ప్రతిభకు మరియు అవకాశాలకు వేదికలుగా ఉండాలి తప్ప, ఆందోళనకు మరియు అనిశ్చితికి కారణం కాకూడదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి పటిష్టమైన చర్యలు, సాంకేతిక భద్రత మరియు సంస్థాగత జవాబుదారీతనం ఉండాలని రేవంత్ స్పష్టం చేశారు.