ఫెవికాల్ బంధం.!

Spread the love

Bay of Bengal Cyclones: బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టడం.. అది తుఫానుగా మారడం.. మనల్ని ముప్పుతిప్పలు పెట్టడం! మనం తరచూ వింటూ వస్తున్న మాట ఇది. వాయుగుండం పుట్టిందంటే అది బంగాళాఖాతంలోనే అని ఖరారైపోవడం మనకు అలవాటు. అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య ఉండే ఈ ఫెవికాల్ బంధం ఏంటి.. బంగాళాఖాతమే తీవ్రమైన సైక్లోన్లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? ప్రపంచంలో అత్యంత తీవ్ర తుపానులు బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి? పూర్తి డిటేల్స్ తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

ప్రపంచంలోనే అతి పెద్ద తీరప్రాంతం బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది. సుమారు 50 కోట్ల మంది ఈ తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుపానుల్ని ఎదుర్కొంటోంది కూడా ఈ తూర్పు తీర ప్రాంతమే. వాతావరణ వివరాలను అందించే వెబ్ సైట్ వెదర్ అండర్‌ గ్రౌండ్‌లో ఈ తీరానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలున్నాయి. ఈ వెబ్‌సైట్ ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన 35 తుపానుల్లో 27 పెను తుపాన్లు ఈ తీరంలోనే సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తుంటాయని చెబుతారు వాతావరణ పరిశోధకులు. ఇక్కడ లోతు తక్కువగా ఉంటూ ఒక వైపుకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది. సాధారణంగా తుపాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డువైపుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది.

ఈ తరహా భౌగోళిక పరిస్థితులకు బంగాళాఖాతం ఓ స్పష్టమైన ఉదాహరణ అని వెదర్ అండర్ గ్రౌండ్‌ కాలమిస్ట్, ప్రముఖ వాతావరణ పరిశోధకులు బాబ్ హెన్సన్ తెలిపారు. బంగాళాఖాతం ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండటం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఫలితంగా తీవ్ర తుపానులు సంభవిస్తుంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెను తుపానులు సంభవించే మరికొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతం. కానీ బంగాళాఖాతపు ఉత్తర తీర ప్రాంతంలో తుపానులు ఒక్కసారిగా విరుచుకుపడి పెను నష్టానికి కారణమవుతాయి. భూమిమీద ఇంకెక్కడా ఇంత దారుణమైన పరిస్థితులు తలెత్తవు” అని హెన్సన్ అన్నారు. తూర్పు తీర ప్రాంతంలో జనసాంద్రత అధికంగా ఉండటం కూడా తీవ్ర నష్టానికి కారణమవుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు తీర ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

పెను తుపానుల వల్ల అనేక విపత్తులు ఎదురవుతాయి. బలమైన గాలుల కారణంగా భౌతిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో అలల పోటు తీవ్రంగా ఉంటుంది ఈ రెండింటితో పాటు భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తాయి.సాధారణంగా బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలో తరచూ తుపానులు వచ్చినా ప్రతి పదేళ్లకు ఒకసారి మాత్రమే ఈ స్థాయి తుపానులు విరుచుకుపడుతుంటాయి.

1970లో వచ్చిన భోలా తుఫాను ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైనది. 2008 మేలో బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుఫానుకు లక్షా 40 వేల మంది చనిపోయారు. నిన్నమొన్నటి మిచౌంగ్ దాకా… డేంజరస్ తుఫాన్లన్నీ పుట్టింది బంగాళాఖాతంలోనే. ఇవే కాదు.. ఇంతవరకూ సంభవించిన అత్యంత భీకరమైన 35 తుపానుల్లో 27 తుఫాన్లు బంగాళాఖాతంలోనే పుట్టాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగాళాఖాతంలో సంభవించే తుపానుల తీవ్రత పెరుగుతూ వస్తోంది.

చివరిసారిగా 1999లో సూపర్ సైక్లోన్ భారత్‌లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుపాను ధాటికి సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్లిన శవాలు, శ్మశానాల్లో ఆకాశాన్ని అంటుతున్న పొగ.. అప్పట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించిన నాకు కనిపించిన దృశ్యాలవి. నాటి భయానక పరిస్థితి ఇప్పటికి నాకు గుర్తుంది. ఓ సూపర్ సైక్లోన్ ధాటికి పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతాయో మొదటిసారిగా నాకు అప్పుడే తెలిసింది. డానా అని పిలువబడే తాజా తుఫాను సాపేక్షంగా మధ్యస్థంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటైన 1999 సూపర్ సైక్లోన్ నుండి పాఠాలు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జీవనోపాధికి కనీస అంతరాయం జరగకుండా చూసుకున్నాయి. డానా తుఫాను సమీపిస్తున్న కొద్దీ, అనేక సముద్రతీర గ్రామాలు దెయ్యాల పట్టణాలుగా మారాయి, నివాసితులు తమ ఇళ్లను వదిలి పారిపోయి తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కేంద్రపారాలోని మహాకలపాద బ్లాక్‌లో బంగాళాఖాతం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న తెంటులికంద గ్రామం, 1999 విషాదాన్ని గుర్తు చేస్తుంది. అక్టోబర్ 29, 1999న, ఈ గ్రామంలో 28 మంది మానవ ప్రాణనష్టం జరిగింది. 1999లో, భారత వాతావరణ శాఖ అక్టోబర్ 24న అల్పపీడన వ్యవస్థను గుర్తించింది. ఐదు రోజుల్లో, తీవ్రమైన తుఫాను తుఫాను – అప్పట్లో BoB 06 అని పిలువబడేది – జగత్సింగ్‌పూర్‌లోని పారదీప్ సమీపంలో 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఒడిశాను అతలాకుతలం చేసిన సూపర్ సైక్లోన్ 9,885 మంది ప్రాణాలను బలిగొంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మానవతా సంక్షోభం బయటపడింది… ప్రజల నిరాశ్రులయ్యారు.

తీరప్రాంత ఒడిశాలో ఉష్ణమండల తుఫానులు కొత్తేమీ కాదు, అక్టోబర్‌లో చాలా తుఫానులు వస్తాయి. 1971 అక్టోబర్ 29న, కేంద్రపారాలోని సతభయ గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలను నేలమట్టం చేసిన తుఫానులో దాదాపు 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999లో కేంద్రపారా మరియు జగత్సింగ్‌పూర్‌లను చీల్చివేసిన సూపర్ తుఫాను సుమారు 10,000 మంది ప్రాణాలను బలిగొంది. ఇటీవల, 2013 లో ఫైలిన్, 2014 లో హుధుద్ , తిత్లీ తుఫానులు అక్టోబర్‌లో ఒడిశాను తాకాయి. ఉత్తర హిమాలయాలకు సమీపంలో జెట్ స్ట్రీమ్ యొక్క స్థానం తక్కువ నుండి మధ్యస్థ గాలి కోతకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది, తుఫానుల తీవ్రతకు సహాయపడుతుంది. “రుతుపవనాల తర్వాత అక్టోబర్‌లో ఏర్పడే తుఫానులు, తుఫాను కన్ను చుట్టూ ఉన్న చల్లని గాలి కారణంగా మరింత తీవ్రంగా ఉంటాయి.”

బంగాళాఖాతం లోతు తక్కువగా ఉంటుంది. తీరం ఒకవైపునకు వంగినట్టు పల్లంగా ఉంటుంది. తుపాను సమయంలో వీచే గాలులు నీటిని బలంగా ఒడ్డువైపునకు తోస్తాయి.. దాంతో అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది.. ఇదీ పరిశోధకుల తేల్చిన విషయం. బంగాళాఖాతం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. తీవ్ర తుఫాన్లు ఇక్కడే సంభవించడానికి ఇది కూడా ఒక కారణమని కూడా చెప్పుకోవచ్చు. లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతానిక్కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది కనుక.. అక్కడ సైతం తుపాన్లు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ.. అక్కడ జనజీవనం తక్కువగా ఉంటుంది కనుక.. ప్రాణనష్టం గురించి పెద్దగా బెంగ లేదు. Bay of Bengal Cyclones.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తీరప్రాంతమున్న సముద్రం బంగాళాఖాతమే. 50 కోట్ల మందికి పైగా జనం బంగాళాఖాతం తీరంలోనే బతికేస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లోనే కాదు.. ఏప్రిల్, మే నెల్లో కూడా బంగాళాఖాతం కేరాఫ్‌గా తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి. వీటికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణమన్నది స్పెషలిస్టుల మాట. ఇక అరేబియా సముద్రం ఉపరితలంపై కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సైక్లోన్ల విషయంలో బంగాళాఖాతానికి పోటీకొస్తోందట సో బీ కేర్ ఫుల్.!