విశాఖలో కాప్‌ జెమిని గ్లోబల్ సీఈఓ ఐమన్ ఎజ్జత్..మంత్రి లోకేష్ తో చర్చలు  

Spread the love

కాప్‌ జెమిని గ్లోబల్ సీఈఓ ఐమన్ ఎజ్జత్ ను ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆయనను విశాఖపట్నానికి ఆహ్వానించడం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2026లో ప్రారంభమైన చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న టెక్ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించుకుని, విశాఖపట్నంలో భారీ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు GCC (Global Capability Center) ఏర్పాటు చేయడంపై చర్చించామని పేర్కొన్నారు.  ఈ చర్చల్లో కాప్‌జెమిని ప్రతినిధులు సంజయ్ చక్రవర్తి మరియు కేశవ్ మురుగేష్ గారు కూడా పాల్గొనడం శుభపరిణామని అన్న లోకేష్ త్వరలో ప్రకటించబోయే అద్భుతమైన భాగస్వామ్య అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు పారిశ్రామికాభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి మరియు అనంతపురం వంటి నగరాలను ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్‌లుగా మార్చడానికి ఆయన గ్లోబల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వంటి అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను చాటిచెబుతూ, కాప్‌జెమిని వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సూత్రంతో, ట్రాన్స్పరెంట్ పాలసీలతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *