వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు

Spread the love

సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని  ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు.  ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.  బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పించారు.  మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *