రేపు ఎస్ఎస్సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల కానున్నాయని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆశించిన లక్ష్యాలను చేరుకున్న వారికి అభినందనలు. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే, ఇది కేవలం ఒక మైలురాయి మాత్రమే కానీ గమ్యం కాదని గుర్తుంచుకోండి. మీపై మీరు నమ్మకం ఉంచి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు:
ఎస్ఎస్సి ఫలితాల పోర్టల్: https://results.bse.ap.gov.in
మన మిత్ర వాట్సాప్: 9552300009 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపండి
లీప్ (LEAP) మొబైల్ యాప్
డిజీలాకర్ (DigiLocker) (యాప్ మరియు వెబ్సైట్)
ఫలితాలు విడుదలైన వెంటనే హెడ్ మాస్టర్లు కూడా వారి పాఠశాల లాగిన్ల ద్వారా నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.