ఇది అభివృద్ధి కాదు. ఇది అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విధ్వంసం:రాహుల్ గాంధీ 

Spread the love

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా గ్రేట్ నికోబార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులకు సంబంధించి ఒక కీలక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నేను నా జీవితంలో చూసిన అత్యంత అసాధారణమైన అడవులు ఇవి. జ్ఞాపకాల కంటే పురాతనమైన చెట్లు ఇక్కడ ఉన్నాయి. తరతరాల కృషి ఫలితంగా పెరిగిన అడవులు ఇవి.ఈ ద్వీపంలోని ప్రజలు  ఆదివాసీలు అక్కడ స్థిరపడిన వారు అందమైన మనసున్న వారని అన్నారు. అయితే వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటిని వారు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న పనిని ఒక “ప్రాజెక్ట్” అని పిలుస్తోంది. కానీ నేను చూసింది ప్రాజెక్ట్ కాదు. అది నాశనం కావడానికి సిద్ధంగా ఉన్న 160 చదరపు కిలోమీటర్ల రెయిన్ ఫారెస్ట్. తమ ఇళ్లు లాక్కోబడుతున్నా, పట్టించుకోని దుస్థితిలో ఉన్న సామాజిక వర్గాలు అక్కడ ఉన్నాయి.ఇది అభివృద్ధి కాదు. ఇది అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విధ్వంసమని అన్నారు. అందుకే నేను సూటిగా చెబుతున్నాను, మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను: గ్రేట్ నికోబార్‌లో జరుగుతున్నది మన కాలంలో ఈ దేశపు సహజ మరియు గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాలలో మరియు అత్యంత ఘోరమైన నేరాలలో ఒకటని పేర్కొన్నారు. దీనిని తప్పక ఆపాలన్నారు. నేను చూసిన దానిని భారతీయులందరూ చూడగలిగితే, దీనిని ఆపడం సాధ్యమేనని రాహుల్ పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *