మన మిత్రతో ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాం:మంత్రి నారా లోకేష్

Spread the love

సాధారణంగా మనం ప్రభుత్వాన్ని వివిధ శాఖలు మరియు విభాగాల పరంగా చూస్తుంటాం. కానీ, వాట్సాప్ ఆధారిత విప్లవాత్మక పౌర సేవల వేదిక మన మిత్రతో మేము ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేశామని ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ‘వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ & ఇన్నోవేషన్ ఫోరమ్’లో ఈ ప్రయాణం మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆయన  ప్రసంగించారు. ప్రభుత్వ పాలనలో పౌరుడిని కేంద్ర బిందువుగా ఉంచి, ప్రభుత్వ సేవలను సరళంగా మరియు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి మేము వ్యవస్థలను మరియు ప్రక్రియలను పునర్నిర్మించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ‘మన మిత్ర’ ద్వారా ప్రస్తుతం 900 పైగా సేవలు అందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చకు వేదిక కల్పించిన నిర్వాహకులకు, సంధ్యా దేవనాథన్ కి మరియు మెటా (Meta) టీమ్‌ కు లోకేష్  ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *