దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలలో పయనించాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణి నేడూ కొనసాగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మరియు ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతి చర్చల పురోగతితో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు చక్కబడతాయనే ఆశలు మార్కెట్ లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 753 పాయింట్లు లాభపడి 79,273 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 24,576 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.36గా కొనసాగుతోంది. నేడు ప్రధానంగా బ్యాంకింగ్ మరియు ఎఫ్ఎంసిజి రంగాల షేర్లు రాణించాయి. బ్యాంకింగ్ రంగం నుండి వస్తున్న సానుకూల క్వార్టర్ ఫలితాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయి. సెన్సెక్స్ 30లో ఐసీఐసీఐ బ్యాంకు, హిందుస్థాన్ యూనీలీవర్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగాయి.