బెంగాల్ అభివృద్ధికి 10 ప్రతిజ్ఞలు:సీఎం మమతా బెనర్జీ

Spread the love

వచ్చే నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఈ మేరకు బెంగాల్ అభివృద్ధికి 10 ప్రతిజ్ఞలు అంటూ ప్రజల కోసం అమలు చేసే కార్యక్రమాలను వివరించారు. లక్ష్మీర్ భండార్ : ఈ పథకం కింద నెలకు ₹500 పెంచి, జనరల్ కేటగిరీ మహిళలకు ₹1,500 (ఏడాదికి ₹18,000), మరియు SC/ST కేటగిరీ మహిళలకు ₹1,700 (ఏడాదికి ₹20,400) ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బంగ్లార్ యువ-సాథి కింద నిరుద్యోగ యువతకు నెలకు ₹1,500 (ఏడాదికి ₹18,000) చొప్పున ఆర్థిక తోడ్పాటును అందించనున్నట్లు స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు నిరంతర సహాయం అందించడానికి, భూమిలేని రైతులకు అండగా ఉండటానికి మరియు వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా ఆధునీకరించడానికి ₹30,000 కోట్ల ప్రత్యేక అగ్రి-బడ్జెట్‌. బెంగాల్‌లోని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు మరియు ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఇంటి వద్దకే ఆరోగ్య సేవలను అందించడానికి ప్రతి బ్లాక్ మరియు పట్టణంలో ఏటా ‘దుఆరే చికిత్స’ శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. బంగ్లార్ శిక్షాయతన్ తో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, ఓడరేవులు, వాణిజ్య మౌలిక సదుపాయాలు మరియు అత్యాధునిక ‘గ్లోబల్ ట్రేడ్ సెంటర్’ ఏర్పాటు చేయడం ద్వారా బెంగాల్‌ను తూర్పు భారతదేశపు వాణిజ్య ముఖద్వారంగా మారుస్తామని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులందరికీ నిరంతరాయంగా పెన్షన్ అందిస్తూనే, అర్హులైన మిగిలిన వృద్ధులందరికీ క్రమంగా ఈ సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. సమగ్ర భౌగోళిక పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం  మరియు పట్టణ స్థానిక సంస్థల (ULB) సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ ప్రజాకర్షక పథకాలతో నాలుగో సారి మమతా బెనర్జీ బెంగాల్ సీఎం అవుతారా లేక ఓటర్లు ఈ సారి వేరే పార్టీలకు అవకాశం ఇస్తారో వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *