డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం..స్వాగతించిన సీఎం స్టాలిన్

Spread the love

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికార డీఎంకే గూటికి చేరారు. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఆయనను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా స్టాలిన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, నా ప్రియ సోదరుడు పన్నీర్‌సెల్వం మాతృ సంస్థ అయిన ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) లో చేరారు. వారికి మనస్ఫూర్తిగా సుస్వాగతం పలుకుతున్నాను. ద్రావిడ ఉద్యమ మహోన్నత నాయకుడి పేరు పెట్టుకున్న ఆయన, ద్రావిడ ఉద్యమ సిద్ధాంతాలను కాపాడే మన ఈ గొప్ప ఉద్యమంలో భాగమయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు అనేవి తమిళనాడుకు మరియు బి.జె.పి.కి మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య యుద్ధం. దీనిని గుర్తించే అనేక ప్రజాస్వామ్య శక్తులు కజగం కూటమిలో చేరుతున్నాయి. మనతో చేరిన సోదరుడు ఓ. పన్నీర్‌సెల్వం గారు ఎంతో సంస్కారవంతులు మరియు వినమ్రత కలిగిన వారు! వారి రాక శుభప్రదం కావాలి! తమిళనాడు విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *