వివాదాస్పద షక్సాగామ్ వ్యాలీకి సంబంధించి చైనా చేసిన ఆరోపణలను భారత్ గట్టి జవాబిచ్చింది. 1963లో పాకిస్థాన్, చైనా మధ్య కుదిరిన బోర్డర్ అగ్రిమెంట్ చట్ట విరుద్ధమని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో జరిగే కార్యకలాపాలను భారత్ గుర్తించబోదని పేర్కొన్నారు. షక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఇటీవల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్-చైనా పేర్కొంటున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎప్పటికీ గుర్తించబోమని దీనిపై మా నిర్ణయంపై మారదు. షక్సాగామ్ వ్యాలీ మన దేశంలో భాగమేనని భారత్ స్పష్టం చేసింది. పాక్-చైనా ఎకనామిక్ కారిడార్ను గుర్తించేది లేదని, అది చట్ట విరుద్ధమని ఆర్మీ చీఫ్ అన్నారు. షక్సాగామ్ వ్యాలీ అనేది ఒక వ్యూహాత్మక లోయ. ఇది కారకోరం పర్వత శ్రేణులకు ఉత్తరాన ఉంది. చారిత్రక నేపథ్యం ప్రకారం, 1963లో కుదిరిన చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు బదిలీ చేసింది, అయితే భారత్ దీనిని అంగీకరించలేదు. భారతదేశం ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భాగంగా తన సొంత భూభాగంగా పరిగణిస్తుంది. సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లోయ, భౌగోళికంగా సియాచిన్ గ్లేసియర్కు చాలా దగ్గరగా ఉండటం వల్ల సైనిక పరంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.