
PM Modi Rahul Gandhi: ప్రధాని మోడీ అంటే ఓ లీడర్ మాత్రమే కాదు.. బ్రాండ్ కూడా. ఆయన 11 ఏళ్ల పాలనలో ఇది రుజువైంది. ప్రతిపక్ష నేతలు సైతం ప్రసంశించే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. కానీ రాహుల్ వంటి నేతలు మాత్రం.. అందులో నెగిటివ్ నే ఎక్కువగా చూస్తుంటారు. పక్క దేశం చెప్పిన మాటలను నమ్ముతూ.. మోడీని తప్పుగా చూపించాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి వెనుక కారణాలు ఏంటి..? మోడీ గ్రాఫ్ ను తగ్గంచడమేనా..? అసలు ఏం జరుగుతోంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రధాని నరేంద్ర మోడీ ఏలాంటి నిర్ణయం తీసుకున్న అది దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ అందులో కూడా తప్పులు వెతకడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకుంటున్నాయి. అక్కడితో ఆగారా..? అంటే అది లేదు. మన వ్యతిరేక దేశాలకు మద్దతు ఇస్తూ.. మాతృదేశంపై విద్వేశం ప్రదర్శిస్తున్నారు. సీజ్ ఫైర్ తానే ఆపానన్న ట్రంప్ మాటలను నమ్మిన కాంగ్రెస్ నేతలు.. సీజ్ ఫైర్లో ఎవరి జోక్యం లేదన్న ప్రధాని మోడీ మాటలను నమ్మలేదు. దీంతో దీనిపై చర్చ చేశారు. చివరకు పాకిస్తాన్ కూడా అమెరికా జోక్యం లేదని తెలిపాన తర్వాత శాంతించారు. అయినా ట్రంప్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తాజాగా జేఎఫ్–17 రాకెట్ల తయారీలో ఉపయోగించే ఇంజన్ల విషయంలో అనుమానాలను ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. అమెరికా, పాకిస్తాన్ ఉపయోగించే ఇంజిన్లనే వాడుతున్నరని ప్రచారం చేస్తోంది. కనీసం వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఇది న్యూఢిల్లీ దౌత్యపరమైన ప్రభావాన్ని ప్రశ్నిస్తూ చర్చలను రేకెత్తించింది. అయితే, దగ్గరగా పరిశీలిస్తే, ఇది భారతదేశ భద్రతా స్థితికి సంభావ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రష్యా పాకిస్తాన్ సంయుక్త చైనా–పాక్ యుద్ధ జెట్లను మెరుగుపరచడానికి అప్ గ్రేడ్ చేసిన ఆర్డీ–93ఎంఏ యూనిట్లను సరఫరా చేస్తుందనే గుసగుసలు రాజకీయ రగడలను రేకెత్తించాయి. భారతదేశంలో కాంగ్రెస్ నేతలు దీనిని జాతీయ ప్రయోజనాలకు ఎదురుదెబ్బగా పేర్కొంటున్నారు. అయితే, మాస్కో నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు ఇవన్నీ ఆధారరహిత రెచ్చగొట్టులుగా తోసేస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి సమావేశాల ముందు ఇలాంటి విషయాలు రావడం గమనార్హం.
రష్యా ఇదే ఇంజిన్ ను పాకిస్తాన్ కు అందిస్తోందని, దానినే ఇప్పుడు భారత్ కు సరఫరా చేస్తోందని ప్రధాన ఆరోపణ. 20వ శతాబ్దం మధ్యకాల సోవియట్ బ్లూప్రింట్లకు తిరిగి వెళ్తుంది. ఇవి 1990ల చివరి నాటి సహకార ప్రయత్నాల ద్వారా సవరించబడ్డాయి. ఉద్భవిస్తున్న ఎయిర్ ఫోర్స్లకు ఖర్చుతక్కువ ప్రత్యామ్నాయంగా ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు, ప్రాథమిక మల్టీరోల్ ఆపరేషన్లకు సామర్థ్యం కలిగిన తేలికపాటి ప్లాట్ఫాం సృష్టించడానికి నైపుణ్యాలను సమీకరించింది. ప్రారంభ ప్రోటోటైప్లు నిరూపితమైన రష్యన్ పవర్ ప్లాంట్లపై ఆధారపడ్డాయి. ఇది ఆవిష్కరణ కంటే విశ్వసనీయత, సరసతపై ఆధారపడిన ఎంపిక. 2000ల ప్రారంభంలో ఒక కీలకమైన త్రిపాక్షిక ఒప్పందం జరిగింది. రష్యా ఆర్డీ–93 ఇంజిన్లను చైనాకు సరఫరా చేసింది. చైనా వాటిని పాకిస్తాన్కు విక్రయించింది. ఈ విధానం కొనసాగుతోంది. తర్వాత ఎంఏ వేరియంట్ వంటి అప్గ్రేడ్లు థ్రస్ట్, నిర్వహణలో పనితీరు లోపాలను పరిష్కరిస్తున్నాయి.
అయితే, పరిమిత ఆపరేషనల్ జీవితకాలం, ఓవర్ హాల్ అవసరాల వంటి నిరంతర సమస్యలు ప్లాట్ఫాం తరాల పరిమితులను బయటపెడుతున్నాయి. ఇది ఆధునిక ఆకాశ యుద్ధంలో మూడవ స్థాయి ఆస్తిగా స్థానం కల్పిస్తుంది. భారతదేశానికి, తన స్వంత ఇన్వెంటరీలో ఇలాంటి వ్యవస్థలతో పరిచయం ఉన్నందున, ఇది అంచనా వేయదగిన ప్రత్యర్థి సామర్థ్యాలకు అనువదిస్తుంది. ఇది అనుకూలమైన ప్రతిచర్యలను సాధ్యపరుస్తుంది. 1995లో పాకిస్తాన్, చైనాతో కలిసి తక్కువ ఖర్చుతో కూడిన యుద్ధ విమానం తయారీకి ప్రణాళిక రూపొందించింది. చైనాలోని చెంగ్డు కార్పొరేషన్, సోవియట్ మిగ్–21 ఆధారంగా జేఎఫ్–17 డిజైన్ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్కు రష్యన్ క్లిమోవ్ ఆర్డీ–93 టర్బోఫాన్ ఇంజిన్ను ఎంపిక చేశారు. 1998లో రష్యా–చైనా–పాకిస్తాన్ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం, రష్యా ఇంజన్లను చైనాకు అమ్ముతుంది, చైనా వాటిని పాకిస్తాన్కు సరఫరా చేస్తుంది.
జేఎఫ్–17లు ఆపరేషన్ లోకి వచ్చాక ఇంజిన్ లోపాలు పదేపదే బయటపడ్డాయి. మిగ్–29లు, జేఎఫ్–17లు రెండింటిలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని భారత్ స్వయంగా అనుభవించింది. ఆర్డీ–93కి బదులుగా చైనా డబ్ల్యూ –13 ఇంజిన్ అభివృద్ధి చేసింది కానీ అవసరమైన శక్తి అందించలేకపోయింది. తదుపరి దశలో అభివృద్ధి చేసిన ఆర్డీ–93ఎంఏ ఇంజిన్, బ్లాక్ III మోడల్ కు తగిన పనితీరు చూపింది. రష్యా ఆర్డీ–93ఎంఏను పాకిస్తాన్ కు నేరుగా విక్రయించడం లేదు. చైనాతో ఒప్పందం ప్రకారం చైనాకే సరఫరా చేస్తుంది. పాకిస్తాన్ ఈ ఇంజన్లను చైనా ద్వారా పొందుతుంది. ఇది 1990లలోనే రూపుదిద్దుకున్న సరఫరా విధానం. భారత్ ఇప్పటికే ఆర్డీ–33 ఇంజిన్ సాంకేతికతను స్వీకరించి దేశంలో తయారు చేసే స్థాయికి చేరుకుంది. దీంతో ఆర్డీ–93ఎంఏ హీట్ సిగ్నేచర్, పనితీరు పరిమితులు పూర్తిగా మనకు తెలుసు. అస్త్ర బీవీఆర్ లాంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు ఈ బలహీనతను సులభంగా ఉపయోగించుకోగలవు. PM Modi Rahul Gandhi.
అంతేకాదు, భవిష్యత్తులో ఎఫ్జే–17 ఇంజిన్ ఓవర్హాలింగ్ అవసరం భారత్లోని హెచ్ఏఎల్ ఫెసిలిటీల ద్వారా జరగే అవకాశం ఉంది. ఈ ఇష్యూ రాజకీయ విమర్శలకు కారణమవుతున్నప్పటికీ, రష్యా–భారత్ రక్షణ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం తక్కువ. డిసెంబర్ లో పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఎస్–400, ఎస్–500 వ్యవస్థలు మరియు ఎస్యూ–57 ఫైటర్ జెట్ ఉత్పత్తి వంటి కీలక ఒప్పందాలు చర్చలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజన్ సరఫరా వివాదాన్ని హైలెట్ చేయ్యడంలో.. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగమే అని తెలుస్తోంది. అయితే.. సొంత దేశాన్నే చెడుగా చూపించాలని చూస్తున్న కొంతమంది నాయకులు ఉన్నంత కాలం.. మోడీ మాత్రమే కాదు.. కేంద్రం కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొక తప్పదు.