ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో సెమీస్ చేరిన భారత్  

Spread the love

ఉమెన్స్  హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో  భారత్ సెమీస్ చేరింది. తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో  4-1తో వేల్స్ పై విజయం సాధించి పూల్-బిలో అగ్రస్థానం సాధించింది. ఈనెల 13న  జరిగే సెమీస్ లో  ఇటలీతో భారత  జట్టు తలపడనుంది. ఉరుగ్వేపై స్కాట్లాండ్ గెలవడంతో సెమీస్ కు  అర్హత సాధించింది. తర్వాత వేల్స్ పై అదిరే విజయంతో భారత్ కు  గ్రూప్ లో టాప్ ప్లేస్ ఖాయమైంది. 29, 34, 55వ నిమిషాల్లో మూడు గోల్స్ సాధించిన నవనీత్ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ గెలుపుతో  భారత్ కు వరల్డ్ కప్ బెర్తు కూడా సొంతమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *