ఐపీఎల్ సీజన్ 19లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి సీజన్ లో వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201పరుగులు చేసింది. రజత్ పటేదార్ 63 (40; 4×4, 4×6) హాఫ్ సెంచరీతో ఆ టీమ్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 32 (16; 7×4), వెంకటేష్ అయ్యర్ 29 నాటౌట్ (15; 1×4, 2×6), రోమారియో షెపర్డ్ 22 (11; 2×4, 1×6) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు చొప్పున, సందీప్ శర్మ, రవీంద్ర జడేజా 1 వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభం లభించింది. ఆ టీమ్ పవర్ ప్లే ఓవర్లలోనే 90 పై చిలుకు పరుగులు చేసి సత్తా చాటింది. వైభవ్ సూర్యవంశీ 78 (26; 8×4, 7×6), ధ్రువ్ జురెల్ 81 నాటౌట్ (43; 8×4, 3×6) విధ్వంసకర ఇన్నింగ్స్ లతో చెలరేగారు. రవీంద్ర జడేజా 24 నాటౌట్ పర్వాలేదనిపించాడు. ఇక బెంగళూరు బౌలర్లలో హేజల్ వుడ్, కృనాల్ పాండ్య 2 వికెట్లు చొప్పున పడగొట్టారు.