సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా, సివిల్ సర్వెంట్లందరికీ ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పాలన సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు పౌర కేంద్రితంగా ఉండేలా చూడటంలో వారు నిర్వర్తిస్తున్న బాధ్యతను ఈ రోజు ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ డే థీమ్ “వికసిత భారత్: పౌర కేంద్రిత పాలన మరియు చివరి మైలు వరకు అభివృద్ధి అనేది ఒక స్పష్టమైన దిశానిర్దేశం. అభివృద్ధి అనేది కేవలం విధానాలకే పరిమితం కాకుండా, ప్రతి ఇంటికి మరియు ప్రతి పౌరుడికి సకాలంలో, సమర్థవంతంగా చేరాలని పేర్కొన్నారు. మన పరిపాలన యొక్క బలం, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేకూరే స్థిరమైన ఫలితాలపై ఆధారపడి ఉంటుందని ఈ కృషిలో సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. విధానాలను ఆచరణలోకి తీసుకురావడంలో, వ్యవస్థలను మెరుగుపరచడంలో మరియు జవాబుదారీతనాన్ని కాపాడటంలో సివిల్ సర్వెంట్ల పని ఎంతో కీలకమని అన్నారు. వారి క్రమశిక్షణ మరియు నిబద్ధత దేశ ప్రగతికి నిరంతరం అర్థవంతమైన సహకారాన్ని అందిస్తూనే ఉన్నాయని కొనియాడారు.
సీఎం సహాయ నిధి..రూ.56.39 కోట్లు విడుదల
సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి లబ్ది చేకూరేలా రూ.56.39 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత ఫైలు పై సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 22 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా మొత్తం 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందజేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించలేదని తెలుస్తోంది.