అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ సాధించిన విజయానికి ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రజలిచ్చిన ఈ తీర్పు అభివృద్ధి, స్థిరత్వం మరియు నిర్ణయాత్మక నాయకత్వంపై వారికి ఉన్న ప్రగాఢమైన, పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చిత్తశుద్ధితో కూడిన పాలనపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి, అవకాశాలు మరియు సమగ్ర పురోగతిని ఆకాంక్షిస్తున్న నవ భారతం ఈ విజయంతో శక్తివంతమైన మద్దతును తెలిపిందన్నారు. ఇక తమిళనాడులో అద్భుత విజయాన్ని అందుకుంటున్న విజయ్ కి అభినందనలు తెలిపారు. తమిళనాడులో అద్భుతమైన రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ కి అభినందనలు. ఈ ఫలితం ఆ రాష్ట్ర ఓటర్ల మారుతున్న ఆకాంక్షలను ప్రతిబింబించడమే కాకుండా, అక్కడి రాజకీయ ముఖచిత్రానికి కొత్త కోణాన్ని జోడించింది. ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి, ప్రజల అంచనాలను బాధ్యతతో, అంకితభావంతో నెరవేర్చాలని కోరుకుంటూ ఆయనకు నా శుభాకాంక్షలు అని లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.