బనకచర్లపై సుప్రీం కోర్ట్ కు తెలంగాణ.!

Spread the love

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై తలపెట్టిన పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటాన్ని ఉధృతం చేసింది.ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో,ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనుమతులు లేకుండా పోలవరం పనుల స్వరూపాన్ని మార్చి, బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు నీటిని మళ్లించేలా ఏపీ చేపడుతున్న విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతోందని,దీని వలన తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకుండా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం బలంగా వాదించనుంది.