ఏపీని AI ఆధారిత సృజనాత్మక సంస్థలకు నిలయంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబుతో  ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా స్విట్జర్ ల్యాండ్ వేదికగా సమావేశమయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్ లతో కలిసి సీఎంతో సమావేశమయ్యారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోస్ జెన్ ఏఐ, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితర ఉత్పత్తుల తయారీని ఈరోస్ ప్రతినిధులు వివరించారు. ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు  సీఎంకు ఈరోస్ సంస్థ ప్రతినిధులు వివరించారు.  ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సృజనాత్మక సంస్థలకు నిలయంగా మార్చడానికి కట్టుబడి ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.  ఒక ప్రత్యేకమైన జెన్ ఏఐ (GenAI) మోడల్ మరియు కంటెంట్ సూపర్‌యాప్.విద్యా వ్యవస్థతో ఏఐ అనుసంధానం.ఏఐ ఆధారిత ఫిలిం సిటీ మరియు వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు. ఒక ఏఐ క్రియేటివ్ టెక్ హబ్.’డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360′ పేరుతో వర్చువల్ రియాలిటీ టూరిజం ప్రాజెక్ట్. వంటి  ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ మరియు డిజిటల్ కంటెంట్ ఎకానమీలో అగ్రగామిగా నిలబెట్టడమే కాకుండా, మన యువతకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయన్నారు.