రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బలోత్రా జిల్లా పచ్ పద్ర లోని ఆయిల్ రిఫైనరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను అదుపులోకి తీసురావాడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. రేపు ప్రధాని మోడీ ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉంది. ఇక ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో రేపు ప్రారంభోత్సవం జరగడంపై అనిశ్చితి నెలకొంది. దేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా దీనిని నిర్మించారు. హెచ్పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో సుమారు రూ.79,459 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఇది ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఒక గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీని పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యం 2.4 మిలియన్ మెట్రిక్ టన్నులు. దీని ద్వారా ఎగుమతులు మరియు దేశీయ మార్కెట్ల కోసం పాలీప్రొఫైలిన్ , పాలిథిలిన్ వంటి అధిక విలువ కలిగిన పాలిమర్లను మరియు వివిధ రకాల పెట్రో-ఇంటర్మీడియట్ ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలుస్తోంది.