రాజకీయాల్లో గెలుపు ఓటముల కంటే సిద్ధాంతమే ముఖ్యమని ప్రగాఢంగా విశ్వసించే నాయకుడు.. పవన్ కళ్యాణ్. ప్రజాక్షేమం కోసం ఎంతటి తెగువకైనా వెనుకాడని నైజం ఆయన సొంతం. సనాతన ధర్మ పరిరక్షణే శ్వాసగా సాగుతున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిమేరలు దాటింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంతో తన సత్తా చాటిన జనసేనాని, ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది రాష్ట్రాల వైపు మళ్లించారు. ‘దేవభూమి కేరళలో జనసేన జెండా రెపరెపలాడింది. వందలాది మంది ఇతర పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
పవన్ నాయకత్వ పటిమ కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని కేరళ చేరికలు స్పష్టం చేస్తున్నాయి. కేరళలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు పవన్ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారు. అగ్రనేతలు నాగబాబు, రామ్ తాళ్లూరి సమక్షంలో జరిగిన ఈ చేరికలు జనసేన ఐడియాలజీ పట్ల వారికున్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన గళమెత్తిన తీరు దేశవ్యాప్తంగా యువతకు కనెక్ట్ అయింది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వినతులపై పవన్ స్పందించిన తీరు ఆయనలోని లీడర్ ను సరికొత్తగా పరిచయం చేసింది. మాములు రాజకీయాలకు భిన్నంగా సిద్ధాంతమే ప్రాతిపదికగా ఆయన పార్టీని నిర్మిస్తున్నారు. మున్ముందు ఈ సేన దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ జైత్రయాత్రను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. సిద్ధాంతమే ప్రాతిపదికగా పార్టీ మనుగడ సాగిస్తుందని నమ్మే గొప్ప దార్శనికుడు పవన్ కళ్యాణ్. అందుకే ఇతర పార్టీల వలె అధికారం కోసం కాకుండా ఆశయాల కోసం ఆయన పని చేస్తున్నారు. తాజాగా కేరళలో 200 మందికి పైగా నేతలు జనసేన లో జాయిన్ అవడం అంటే అది పవన్ వ్యక్తిత్వానికి దక్కిన గౌరవం. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ పరిణామం దక్షిణాది రాజకీయాల్లో గేమ్ చేంజర్ అయ్యేలా కనిపిస్తోంది. బాధ్యతాయుతమైన నాయకత్వం ఉంటే ప్రజలు భాషా భేదం లేకుండా కలిసి వస్తారని ఈ పరిణామం చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ అనే పేరు ఇప్పుడు ఒక జాతీయ స్థాయి శక్తిగా రూపాంతరం చెందుతోంది. రాబోయే రోజుల్లో కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ జనసేన అడుగులు వేసే అవకాశం ఉంది. నేషనల్ లేబర్ పార్టీ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని పార్టీల నేతలు జనసేన వైపు చూడటం గమనార్హం. ఇది పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. భాషలు వేరైనా భావజాలం ఒక్కటే అని నిరూపిస్తూ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పంథాను చాటుకుంటున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జనసేన సభ ఒక కొత్త చైతన్యాన్ని నింపింది. అన్ని వర్గాల నుండి పార్టీలోకి చేరికలు రావడం సాధారణ విషయం కాదు.