కాంగ్రెస్ ఈ బిల్లును నిస్సందేహంగా వ్యతిరేకిస్తోంది:రాహుల్ గాంధీ

Spread the love

‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సవరణ బిల్లు’ ట్రాన్స్‌జెండర్ల రాజ్యాంగ హక్కులు మరియు వారి అస్తిత్వంపై జరుగుతున్న ఒక దాడి అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమను తాము గుర్తించుకునే (Self-identify) సామర్థ్యాన్ని హరిస్తుందని భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ ట్రాన్స్‌జెండర్ వర్గాల విభిన్న సాంస్కృతిక గుర్తింపులను తుడిచిపెడుతుందన్నారు. మెడికల్ బోర్డు ద్వారా పరీక్షలు చేయించుకోవాలని ట్రాన్స్‌జెండర్లను బలవంతం చేస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని సంప్రదించకుండానే ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆక్షేపించారు. భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడి జీవించే హక్కును, స్వేచ్ఛను, అస్తిత్వాన్ని మరియు గౌరవాన్ని కాపాడుతుంది. ఈ బిజెపి ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, తన సంకుచిత ఆలోచనల కోసం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలను గౌరవించే భారతదేశపు గొప్ప చరిత్రను నాశనం చేస్తోందని ఆరోపించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *