ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్న భారత పౌరులకు కీలక అడ్వైజరీ

Spread the love

అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరుల కోసం భారత్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. 

ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులకు అడ్వైజరీ: 

ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని మరియు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

భారతీయ పౌరులు ఇజ్రాయెల్ అధికారులు మరియు హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు మరియు సూచనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. భారతీయ పౌరులందరూ తమ నివాస లేదా పని ప్రదేశాలలో తమకు దగ్గరగా ఉన్న సురక్షిత ప్రాంతాల (shelters) గురించి తెలుసుకోవాలి మరియు ఎల్లప్పుడూ వాటికి చేరువలో ఉండాలని సూచించింది.

తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో అనవసరమైన ప్రయాణాలను నివారించాలని స్పష్టం చేసింది. పౌరులు స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు మరియు అత్యవసర హెచ్చరికలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలని ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, భారతీయ పౌరులు టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని (Embassy of India) ఈ క్రింది 24×7 హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది.టెలిఫోన్: +972-54-7520711; +972-54-2428378 ఈమెయిల్: cons1.telaviv@mea.gov.in కూడా పేర్కొంది.రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది మరియు అవసరమైన విధంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుందని తెలిపింది. 

ఇరాన్ లో ఉన్న భారతీయులకు అడ్వైజరీ: 

పరిస్థితుల తీవ్రతను దృష్ట్యా, ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని మరియు వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని సూచించడమైనది. భారతీయులు తాజా వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు భారత రాయబార కార్యాలయం (Embassy of India) నుండి వచ్చే తదుపరి మార్గదర్శకాల కోసం వేచి ఉండాలి.రాయబార కార్యాలయం యొక్క అత్యవసర సంప్రదింపు వివరాలను ఆ అడ్వైజరీలో పొందుపరిచింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *