
Jubilee Hills Election Survey: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక పట్టాన అర్ధంకావడంలేదు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన.. ఎవరు అధికారంలో ఉన్నారో అర్ధం కానీ పరిస్థితి. ఇప్పటికే హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 22 నెలలు అయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలేదు.అందుకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ భయపడుతుందని.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. దీంతో ప్రజల్లో తమకు వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ మాత్రం ఎలాగైనా ఈ సెగ్మేంట్ లో గెలిచి తీరాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలపై కొన్ని సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు. తాజా ప్రజాభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఇప్పుడే ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ సుమారు 85 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంచనాలు ముఖ్యంగా పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తున్న మూడ్ను ప్రతిబింబిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ వంటి ప్రాధాన్య ప్రాంతాల్లోని ఓటర్లు స్పష్టంగా చెబుతున్నది కేసీఆర్ పాలనలో కనిపించిన అభివృద్ధి స్థాయిలను ప్రస్తుత ప్రభుత్వం చేరుకోలేకపోతోంది. రోడ్ల విస్తరణ, కాలువ వ్యవస్థ, స్మార్ట్లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పని దిశలో స్థానికంగా మాగంటి గోపీనాథ్ పేరు వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఈ ప్రాంతంలో కాంగ్రెస్పై నిరుత్సాహం పెరుగుతోందని పౌరులు పేర్కొంటున్నారు.ప్రజల అభిప్రాయాల ప్రకారం కేసీఆర్ పాలన పద్ధతి స్థిరత్వం, ప్రణాళికాబద్ధతకు కేరాఫ్గా ఉండగా, రేవంత్ వైఖరి ఎక్కువగా ప్రతిస్పందనాత్మకంగా, ప్రచారాధారితమైందని భావిస్తున్నారు. పథకాల నిరంతరత, బహుళ కార్యక్రమాల రూపకల్పన, శక్తివంతమైన బ్యూరోక్రసీ నియంత్రణ వంటి అంశాలలో కేసీఆర్ రికార్డు గుర్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉన్నప్పటికీ, నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. Jubilee Hills Election Survey.
2023లో కేసీఆర్ ఇచ్చిన హామీలను మించి అమలుచేస్తామని పార్టీ వర్గాలు ప్రకటించడం గ్రామీణ ప్రజల్లో విశ్వాసం కలిగించింది. రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు ఇంకా గుర్తుండే స్థాయిలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పాలను మించి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ను విశ్వసించారు. హైదరాబాద్లో వాగ్దానాలు కంటే వాస్తవ పనులు ముఖ్యమన్న భావన బలంగా వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కేంద్రం, పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిన కృషితో ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. మాగంటి గోపీనాథ్ రాజకీయ మైదానంలో పునరుద్ధరణకు ప్రజల విశ్వాసం ఒక బలమైన సంకేతమని స్థానిక విశ్లేషకులు గుర్తిస్తున్నారు. అదే సమయంలో, రేవంత్ రెడ్డి ప్రాధాన్యం గల నిర్ణయాలు హైదరాబాద్ మధ్యతరగతి వర్గంపై ప్రభావం చూపలేదని భావిస్తారు. ప్రస్తుత సామాజిక- రాజకీయ పరిస్థితులు చూస్తే, పట్టణ-గ్రామీణ రెండు స్థాయిల్లో కూడా కేసీఆర్ నాయకత్వంపై ఒక నోస్టాల్జియా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. రాబోయే నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల అంచనాలను అనుసరించి పనిచేయగల సామర్థ్యం ఉంటేనే ఆ ప్రభావాన్ని తగ్గించగలదని పలువుర