సొంతగడ్డపై సన్ రైజర్స్  హైదరాబాద్ పరాజయం..5 వికెట్ల తేడాతో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ 

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా  సొంత గడ్డపై ఆడిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పరాజయం చెందింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7), కెప్టెన్ ఇషాన్ కిషన్ (1), లివింగ్ స్టన్ (14) నిరాశపరిచారు. హైదరాబాద్ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో హెన్రిచ్ క్లాసీన్ 62 (41; 5×4, 2×6), నితీష్ కుమార్ రెడ్డి 56 (33; 3×4, 5×6) హాఫ్ సెంచరీలతో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ మంచి స్పెల్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ కూడా 2 వికెట్ల చొప్పున తీశారు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మనిమారన్ సిద్దార్థ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్ ను రిషబ్ పంత్ 68 నాటౌట్ (50; 9×4) ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చాడు. ఐడెన్ మార్కరమ్ 45 (27; 6×4, 2×6) ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. దీంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు రాగలిగింది. హార్ష్ దూబే 2 వికెట్లు, ఇషాన్ మలింగ, శివాంగ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *