ఏపీ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదు..అది ఒక వ్యూహాత్మక ప్రయోజనం:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదని  అది ఒక వ్యూహాత్మక ప్రయోజనమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన CII సమావేశం “ఇండియా ఎట్ ది సెంటర్: ది జాగ్రఫీ ఆఫ్ గ్రోత్ – ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్” లో పారిశ్రామిక దిగ్గజాలతో సంభాషించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్ యొక్క బలాలు మరియు నైపుణ్యాలను వారికి వివరించినట్లు తెలిపారు. భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (FDI) దాదాపు 25% వంతు వాటాను కలిగి ఉండటంతో పాటు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో మేము ప్రదర్శిస్తున్న వేగం ఏపీని ఒక ప్రధాన పెట్టుబడి కేంద్రంగా మార్చింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామిక రంగాన్ని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్న శ్రీమతి మార్లిన్ బ్లాట్నర్-హోయల్, మిస్టర్ ఫిలిప్ అస్మస్, మిస్టర్ రిచర్డ్ వర్మ, మిస్టర్ రాజీవ్ మేమని, మిస్టర్ చంద్రజిత్ బెనర్జీ మరియు మిస్టర్ సంజీవ్ బజాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.