దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరుకావడం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. వారి రాక భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య పెరుగుతున్న బంధాన్ని మరియు మన ఉమ్మడి విలువల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ పర్యటన భారతదేశం మరియు యూరోప్ మధ్య వివిధ రంగాలలో లోతైన భాగస్వామ్యానికి మరియు సహకారానికి మరింత ఊపునిస్తుందని పేర్కొన్నారు. ఇక భారతదేశం తన గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంతో మరియు గర్వంతో జరుపుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కర్తవ్య పథ్లో జరిగిన అద్భుతమైన పరేడ్ మన ప్రజాస్వామ్య శక్తిని, మన వారసత్వ సంపదను మరియు దేశాన్ని ఏకతాటిపై ఉంచే ఐక్యతను చాటిచెప్పింది. ఈ పరేడ్ భారతదేశం యొక్క పటిష్టమైన భద్రతా వ్యవస్థను ప్రతిబింబించడమే కాకుండా, దేశ సంసిద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని మరియు పౌరుల రక్షణ పట్ల మనకున్న అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించింది. గణతంత్ర దినోత్సవ కవాతు భారత భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలను కళ్లకు కట్టింది. మన సైనిక బలగాలు నిజంగా మన గర్వకారణం. అలాగే, కర్తవ్య పథ్లో ఈరోజు భారతీయ సంస్కృతిక వైవిధ్యం కనువిందు చేసింది. వైవిధ్యభరితమైన ప్రదర్శనలు మరియు శకటాల ద్వారా భారతదేశపు సాంస్కృతిక సౌరభాన్ని ఈ పరేడ్ ఘనంగా చాటిచెప్పిందని పేర్కొన్నారు.