విశాఖపట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత, డిఫ్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, దేవాదాయ శాఖకు చెందిన అధికారులు పర్యవేక్షణ లో నేడు హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించారు. గత 21 రోజులకు గాను భక్తులు సమర్పించుకున్న కానుకలను అధికారులు లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది మరియు బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపు ప్రక్రియ అంతా కట్టుదిట్టమైన భద్రత మరియు నిఘా నీడలో నిర్వహించబడింది.
గత 21 రోజుల్లో భక్తుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో: ₹1,74,13,815.00
నాణేల రూపంలో: ₹11,01,996.00
మొత్తం నగదు ఆదాయం: ₹1,85,15,811.00 (కోటి ఎనభై ఐదు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు).
బంగారం మరియు వెండి కానుకలు:
భక్తులు తమ మొక్కుబడుల రూపంలో సమర్పించిన విలువైన లోహాల వివరాలు,
బంగారం: 55 గ్రాముల 500 మిల్లీ గ్రాములు.
వెండి: 6 కిలోల 140 గ్రాములు.
విదేశీ కరెన్సీ (కానుకలు):
సింహాచల అప్పన్న దర్శనానికి దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు వివిధ దేశాల కరెన్సీని కూడా హుండీలో సమర్పించారు.
ఇందులో ముఖ్యంగా అమెరికా: 174 డాలర్లు
UAE: 295 దిర్హామ్స్
సౌదీ అరేబియా: 110 రియాల్స్
కువైట్: 6.75 దినార్లు
వీటితో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, నేపాల్, ఓమన్, ఖతార్, నైజీరియా మరియు వియత్నాం దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా లభించాయి.