ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు హామీ

Spread the love

మన దేశ రాజధాని  ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ (AI)ఇంపాక్ట్ సదస్సులో మౌలిక వసతుల రంగంలో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు  హామీలు లభించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీసీ/డీప్ టెక్ టెక్నాలజీలపై 20 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసేందుకు ఇన్వెస్టర్లు  ముందుకొచ్చారనీ తెలిపారు. ఈ శిఖరాగ్ర సదస్సులో 5 లక్షల మందికి పైగా విజిటర్స్  పాల్గొన్నారని పేర్కొన్నారు. సమిట్ ఢిల్లీ డిక్లరేషన్ పై 70కి పైగా దేశాలు ఇప్పటికే సంతకాలు చేశాయని వివరించారు. ఇక  ఈ సంఖ్య 80 దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంశంలో ప్రధానమైన దేశాలన్నీ డిక్లరేషన్ పై సంతకాలు చేశాయని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *