ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కొనుగోలు చేయడంపై బీజేపీ నేత సంగీత్ సోమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న తరుణంలో ఆ దేశ ఆటగాడి కోసం షారుఖ్ ఖాన్ తొమ్మిది కోట్లు వెచ్చించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా షారుఖ్ను “దేశద్రోహి” అని సంబోధిస్తూ, ఇలాంటి వారికి భారత్లో ఉండే హక్కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లా ఆటగాళ్లు విమానాశ్రయం దాటి బయటకు రాలేరని కూడా ఆయన హెచ్చరించారు. ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బంగ్లా ఆటగాళ్లను ప్రోత్సహించవద్దని సూచించారు. అయితే, కాంగ్రెస్ నేత సురేందర్ రాజ్పుత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, షారుఖ్ను మతం ప్రాతిపదికన లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే క్రీడల్లో రాజకీయ వేడి రాజుకుంది.
బంగ్లా ఆటగాడి కొనుగోలు పై బీజేపీ నేత ఆగ్రహం…షారుఖ్పై ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు!
ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కొనుగోలు చేయడంపై బీజేపీ నేత సంగీత్ సోమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న తరుణంలో ఆ దేశ ఆటగాడి కోసం షారుఖ్ ఖాన్ తొమ్మిది కోట్లు వెచ్చించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా షారుఖ్ను “దేశద్రోహి” అని సంబోధిస్తూ, ఇలాంటి వారికి భారత్లో ఉండే హక్కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంగ్లా ఆటగాళ్లు విమానాశ్రయం దాటి బయటకు రాలేరని కూడా ఆయన హెచ్చరించారు. ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బంగ్లా ఆటగాళ్లను ప్రోత్సహించవద్దని సూచించారు. అయితే, కాంగ్రెస్ నేత సురేందర్ రాజ్పుత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, షారుఖ్ను మతం ప్రాతిపదికన లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే క్రీడల్లో రాజకీయ వేడి రాజుకుంది.