టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ప్రవేశించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2022 వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా రెండో సారి ఫైనల్ చేరింది. ఇక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ 89 (42; 8×4, 7×6) మరోసారి కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. శివమ్ దూబే 43 (25; 1×4, 4×6), ఇషాన్ కిషన్ 39 (18; 4×4, 2×6), హార్థిక్ పాండ్య 27 (12; 3×4, 2×6), తిలక్ వర్మ 21 (7; 3×6) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టారు. టార్గెట్ ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కూడా మంచి పోరాటం కనబరిచింది. ముఖ్యంగా జాకోబ్ బెతెల్ 105 (48; 8×4, 7×6) సెంచరీతో అసాధారణ పోరాటం కనబరిచాడు. విల్ జాక్స్ 35 (20; 4×4, 2×6), జాస్ బట్లర్ 25 (17; 4×4, 1×6) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్య 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత జట్టు సమిష్టిగా రాణించింది. దీంతో అద్వితీయ విజయం సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.