హైదరాబాద్ యువ బ్యాటర్ అమన్ రావ్ పేరాల విజయ్ హజారే ట్రోఫీలో తన బ్యాటింగ్ తో అలరించాడు. తాజాగా బెంగాల్తో జరిగిన మ్యాచ్ లో చెలరేగి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన 21 ఏళ్ల అమన్, తొలి 10 బంతుల్లో 3 పరుగులే చేశాడు. ఓపెనర్ రాహుల్ సింగ్ తో కలిసి కీలక పార్టనర్షిప్ నెలకొల్పాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను, 107 బంతుల్లో తన తొలి లిస్ట్ ఏ సెంచరీ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 150 పరుగుల మార్కును 134 బంతుల్లో దాటాడు. మరో 20 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 12×4, 13×6 భారీ సిక్సర్లు ఉన్నాయి.ఈ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది కేవలం తొమ్మిదో డబుల్ సెంచరీ కాగా, లిస్ట్ ఏ ఫార్మాట్ లో డబుల్ సెంచరీ సాధించిన 15వ భారత బ్యాటర్గా అమన్ రికార్డు సృష్టించాడు. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అమన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.30లక్షలకు కొనుగోలు చేసింది.