భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈ వరల్డ్ కప్ లో చూడగలమా అన్న అభిమానుల సందిగ్దతకు తెర పడింది. ఈ టీ20 ప్రపంచకప్ లో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. భారత్ తో మ్యాచ్ ను ఆడబోమని ఇదివరకు ప్రకటించిన పాకిస్థాన్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాలు విజ్ఞప్తితో భారత్ తో మ్యాచ్ ఆడేందుకు జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక భారత్-బంగ్లాదేశ్-పాకిస్థాన్ ల మధ్య ట్రై యాంగిల్ సిరీస్ జరపాలన్న ఆ దేశం ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది.