మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యల పై దిశానిర్ధేశం చేశారు. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్ట్రీట్ లైట్స్ నిర్వహణ తదితర అంశాల పై అధికారులకు పలు సూచనలు చేశారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని… పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. త్వరలో ప్రతి జోన్ లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు.