ఆ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి:కె.టి.ఆర్

Spread the love

వనదేవతలు సమ్మక్క సారలమ్మను కొలుస్తూ.. ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతరని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.ఆర్ అన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడుతూ… సమ్మక్క సారలమ్మల పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతికి ప్రతీక సమ్మక్క సారలమ్మ మహా జాతరని పేర్కొన్నారు. మేడారం జాతర (జనవరి 28-31) సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర సందర్భంగా… ఆ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు కె.టి.ఆర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.