ముంబై క్లైమేట్ వీక్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెరీ మరియు కెన్యా పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చారిటీ కథంబి చెకియోంగ్ తో కలిసి, మనం ఎదుర్కొంటున్న వాతావరణ అత్యవసర పరిస్థితి మరియు దానిని సమిష్టిగా ఎలా పరిష్కరించాలనే అంశాలపై చర్చించారు. భారతదేశ భవిష్యత్తు పురోగతిలో, ముఖ్యంగా మన 2047 లక్ష్యాలను సాధించడంలో, గ్రీన్ ఎనర్జీతో కూడిన తయారీ రంగాన్ని మరియు అన్ని విధాలుగా స్థిరత్వాన్ని ఒక మిషన్ లాగా, అత్యంత వేగంగా పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పూర్తిగా స్థిరత్వానికి అనుగుణంగా ఉందని, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని మరియు రాజధాని హైదరాబాద్ ను దేశానికే రోల్ మోడల్గా మారుస్తుందని ఈ సందర్భంగా వివరించారు.